Comprehension Passage

సూచన : ఈ క్రింద  ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాయండి. 

జానపద విజ్ఞాన సంగ్రహ కార్యం ఐరోపా ఖండంలో పందొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో ఆరంభమైంది. 1812 లో గృమ్ సోదరులు Kinder und-Hausmarchen అన్న కథా సంకలనాన్ని ప్రచురించి, కథా సంగ్రహ కార్యానికి నాందీ పలికి తక్కిన వారికి మార్గదర్శకులైనారు. 

భారతదేశంలో జానపద సాహిత్య సేకరణ పాశ్చాత్య పండితుల వల్లనే ఆంగ్లంలోనే మొట్టమొదట జరిగింది. అబ్బే డూబాయిస్ గారి 'హిందూ మ్యానర్స్ అండ్ కస్టమ్స్' అన్న గ్రంథం 1816 లో వెలువడింది. ఇందులో కొన్ని జానపద కథలు ఉన్నాయి. 'ఓల్డ్ డెక్కన్ డేస్ లేదా ఇండియన్ పేర లిజెండ్స్ కరెంట్ ఇన్ సౌత్ ఇండియా' అన్న గ్రంథాన్ని ఎం. ఫ్రెరె 1868 లో వెలువరించారు. ఇదే భారతదేశంలోని ప్రప్రథమ సేకరణ గ్రంథమాని చెప్పబడుతోంది. 1879 లో స్టోక్ అనే అతను 'ఇండియన్ ఫేరీ టేల్స్' ను ప్రచురించారు. 1883 లో బెంగాలీ కథల సంకలనాన్ని ఎల్.బి.డే. ప్రకటించారు. 1887 లో జె.హెచ్. నోవెల్స్ కాశ్మీరు జానపద కథలని ప్రచురించారు. 1892 లో జె. జాకొబ్ 'ఇండియన్ ఫెరీటెల్స్' అన్న గ్రంథాన్ని ప్రకటించాడు. 1884-85, 1900 లో ఆర్.సి. టెంపల్ 'లిజెండ్స్ ఆఫ్ పంజాబ్' అన్న గ్రంథాన్ని మూడు సంపుటాలలో ప్రచురించాడు. 'ఫోక్ టేల్స్ ఆఫ్ సదరన్ ఇండియా' అన్న గ్రంథాన్ని పండిత నటేశ శాస్త్రి గారు 1884-1893 లో ప్రచురించారు. 

ఈఎమ్. గోల్డన్ 1909 లో 'ఇండియన్ ఫోక్ టేల్స్' అన్న గ్రంథాన్ని, పండిత నటేశ శాస్త్రి గారు 1908 లో 'ఇండియన్ ఫోక్ టేల్స్' అన్న గ్రంథాన్ని ప్రచురించారు. 1916 లో 'ఫోక్ టేల్స్ ఆఫ్ అస్సాం' అన్న గ్రంథాన్ని జె. బారువాగారు, 1912 లో డబ్ల్యూ. ఎం.సి. కుల్లక్ 'బెంగాలీ హౌస్ హోల్డ్ టేల్స్' ను, 1919 లో 'డెక్కన్ నర్సరీ టేల్స్' లేదా 'ఫిరీ టేల్స్ ప్రమ్ ది సౌత్' అన్న గ్రంథాన్ని సి.ఏ. కింకేయిడ్ ప్రచురించారు. బ్రాడ్లీ బర్ట్ గారి 'బెంగాల్ ఫేరీ టేల్స్' 1920 లోనూ, సి.ఏ. కింకేయిడ్ గారి 'టేల్స్ ఆఫ్ ఓల్డ్ సింథ్' 1922 లోను, పి.ఓ. బోడ్డింగ్ గారి 'సంతాల్ ఫోక్ టేల్స్' (మూడు సంపుటాలు) 1925-29 ప్రాంతంలోను ప్రచురించబడ్డాయి. 

భారతదేశంలో సేకరించబడిన మరికొన్ని జానపద కథాసంకలనాలు

చార్లెస్ స్విన్నెర్టన్ - 'రొమాంటిక్ టేల్ ప్రమ్ ది పంజాబ్ (1928)', జె.బారువా - 'ఫోక్ టేల్స్ అస్సామ్ (1915)', ఎన్. కాసీంద్రనాథ్ బెనర్జీ- 'పాపులర్ టేల్స్ ఆఫ్ బెంగాల్ (1905)', సి.బి. బెనర్జీ- 'టేల్స్ ఆఫ్ బెంగాల్ (1910)', విల్ ఫ్రెడ్ ఇ. డెక్ట్సర్ - మరాఠీ ఫోక్ టేల్స్ (1938) డబ్ల్యూ. హెచ్.డి. రేస్- 'ద టాకింగ్ త్రస్ట్ అండ్ అదర్ టేల్స్ (1938)', డా. వరియర్ ఎల్విన్ - ఫోక్ టేల్స్ ఆఫ్ మహాకోశల్ (1944), ఎం.జి. ఆండర్సన్ - 'ఇండియన్ ఫేబల్స్ అండ్ లిజెండ్స్ (1936)'. ఏ. యస్.పి. అయ్యర్ - 'ఫేమస్ టేల్స్ ఆఫ్ ఇండియా (1954) 'సురేష్ బాట్ నగర్ - 'సచిత్ర కురుప్రదేశ్ కీ లోక్ కథాయే (1959)', పంచిప్రీతమ్ సింగ్ - 'పంజాబ్ కీలోక్ కథాయే (1957)', జ్ఞానేంద్ర కుమార్ బాట్ నగర్ - 'సచిత్ర కేరళ్ కీ లోక్ కథాయే (1958)', జ్ఞానేంద్ర కుమార్ బాట్ నగర్ - 'సచిత్ర తమిళ్ నాడ్ కీ లోక్ కథాయే (1959)', జ్ఞానేంద్ర కుమార్ బాట్ నగర్ - 'సచిత్ర కర్ణాటక కీ లోక్ కథాయే (1959)', ఏసియా పబ్లిషింగ్ హౌస్, బాంబే-'ఫోక్ టేల్స్ ఆఫ్ రాజస్థాన్ (1964)'. 

ఇలాగే ఎమ్.బి ఎమెనో దక్షిణ భారత జానపద కథలని అధ్యయనం చేసి కొన్ని వ్యాసాలను పత్రికలలో ప్రచురించారు. కర్ణాటక రాష్ట్రంలో వందకు పైగా జానపద కథా సంకలన గ్రంథాలు వెలువడ్డాయి. స్టెర్లింగ్ పబ్లిషర్స్, ఢిల్లీవారు భారతదేశంలోని పెక్కు రాష్ట్రాల జానపద కథలను (ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాల వారీగా) ఆంగ్లంలో ప్రచురించారు. ప్రధానంగా జానపద కథల సేకరణ కృషిని గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరికొన్ని వివరాలకు డా. శ్యామ్ పర్మార్ మరియు శ్రీ శంకర్ సేన్ గుప్తాగారల 'ఏ బిబ్లియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ ఫోక్ లోర్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్' అన్న గ్రంథాన్నీ, డా. జవహర్ లాల్ హండూగారి' ఏ బిబ్లియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ ఫోక్ లోర్' అన్న గ్రంథాన్నీ, హెచ్.సి. ప్రసాద్ మరియు గీతాసేన్ గుప్తాగారల 'ఎ' బిబ్లియోగ్రఫీ ఆఫ్ ఫోక్ లోర్ ఆఫ్ బీహార్' అన్న గ్రంథాన్ని చూడగలరు. 

కాశ్మీరు జానపద కథలు ప్రచురించబడిన సంవత్సరం

1
1887
2
1883
3
1892
4
1893

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation