Comprehension Passage

సూచన: ఈ క్రింది ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి క్రింద గల ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.

మీర్ అహమద్  అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిజాం ఏలుబడిలో చీఫ్ ఇంజినీరుగా పనిచేశారు. ఆయన హైదరాబాదు పాంటస్తీలో 1877 జులై 11న జన్మించారు. హైదరాబాద్ సంస్థానంలో అనేక నీటిపారుదల పథకాలు నవాబ్ జంగ్ చలవే. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్, అలీ సాగర్ నిర్మాణానికి ఆయనే బాధ్యుడు. ఆయన జాతీయ నదీ జలాల నీటిపారుదల మా పని చేశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లోని సూపర్ హిల్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్య అభ్యసించారు. 1899లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పబ్లిక్  విభాగంలో పనిచేసే 1918లో చీఫ్ ఇంజినీర్ స్థాయికి ఎదిగారు. బొంబాయిలో సుక్కూర్ బ్యారేజికి సంబంధించి ఆర్థిక, సాంకేతిక అంశాల మీద నివేదిక తయారు చేయడంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి పని చేశారు.

నవాబ్ జంగ్ అనేక ప్రధానమైన భవనాలు, నీటి పారుదల పథకాల నిర్మాత, ఢిల్లీలోని హైదరాబాద్ హజ్ ను నిర్మించింది ఆయనే. గోదావరి, మంజీరా నదుల మీద వంతెనలకు కారకుడూ ఆయనే, జిల్లాల్లో టెలిఫోన్ సదుపాయాలు కల్పించడం కూడా ఆయన కృషి ఫలితమే. వైరా, పాలేరు,ఫతే నహర్ నీటి పారుదల పథకాల నిర్మాణంలో ఆయన కృషి విష్కరించడానికి విల్లేనిది. తుంగభద్ర, కృష్ణ నదుల పంపకంలో హైదరాబాద్ సంస్థానానికి, మద్రాసు ప్రభుత్వానికి వివాదం తలెత్తినప్పుడు రెండు పక్షాలకు నష్టం లేని రీతిలో ఆ సమస్యను పరిష్కరించింది నవాబ్ జంగ్  బహదూర్, నిజామాబాద్ జిల్లాలోని అలీ సాగర్ పథకం ఆయన స్మృతికి అంకితంమైంది.

కె.ఎల్, రావుగా ప్రసిద్ధులైన కామారి లక్ష్మణరావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1902 జులై 15న జన్మించారు. తొమ్మితో ఏటనే ఆయన తండ్రి మరణించారు. చిన్నప్పుడు పాఠశాలలో ఆడుకుంటున్నప్పుడు ఒక కన్ను పోయింది. ఇవేవీ కె. ఎల్. రావుకు ఆటంకాలు కాలేదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగులో స్నాతకోత్తర పట్టా పుచ్చుకున్న మొదటివారు కె. ఎల్. రావు, ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాం విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డీ చేశారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన నాగార్జునసాగర్ ఆనకట్టకు రూపకల్పన చేసింది కె. ఎల్. రావే.

కె.ఎల్, రావుగా  రాజకీయరంగంలోనూ మేటి అనిపించుకున్నాడు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి 1961లో మొదటిసారి ఎన్నికై మొత్తం మూడు సార్లు ఆ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ దగ్గర నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుడు కె. ఎల్. రావు సాగర్ గా పేరు పెట్టడం తెలుగువారు ఆయనకు అర్పించిన నివాళి.

ఆరోగ్య ప్రదాత యల్లాప్రగడ .ప్రచార ఆరాటం లేనివారు చరిత్రలో అనామకంగా మిగిలిపోతారు. అనేక రోగాలను నయం చేయడానికి చాలా యాంటీ బయాటిక్ మందులను కనిపెట్టినా నేవల్ బహుమతి లాంటివి యల్లాపురడ సుబ్బారావు (1895 జనవరి 2 - 1948 ఆగష్టు 9) కు రాకపోవడానికి కారణం ఆయన అజ్ఞాతంగా ఉండడానికి ప్రాధాన్యం ఇవ్వడమే. క్షయ, బోదకాలు లాంటి కుదరని రోగాల బారిన పడ్డవారి బదుకుల్లో ఊపిరులూదిన వారు యల్లాప్రగడ సుబ్బారావు, యల్లాప్రగడ భీమవరంలో పేద కుటుంబంలో జన్మించారు. పేదరికం అడుగడుగునా అడ్డు తగలడంతో మూడో ప్రయత్నంలో తప్ప సుబ్బారావు మెట్రిక్యులేషన్ పరీక్ష గట్టెక్కలేక పోయారు. మిత్రులు, కస్తూరి సత్యనారాయణ వంటి వారి ఆర్థిక సాయంతో సుబ్బారావు వైద్య కళాశాలలో చేరారు. ఆయన జాతీయభావాలతో ప్రభావితమై ఖద్దరు ధరించేవారు. విదేశీ వస్తు బహిష్కరణను సమర్ధించారు. ఇదే ఆయనకు ఎం.బి.బి.ఎస్. డిగ్రీ దకుండా చేసింది. ప్రొఫెసర్ ఎం.సి. బ్రాడ్ ఫీల్డ్ కు సుబ్బారావు జాతీయ భావాలు నచ్చక ఎం.బి.బి.ఎస్. డిగ్రీ క్కకుండా చేసి, ఎల్.ఎం.ఎస్. డిగ్రీతో సరిపెట్టారు. 1922లో సుబ్బారావు అమెరికాలోని బోస్టన్ వెళ్లారు. హార్వర్డ్ లో ఉష్ణ మండల వైద్యకళాశాలలో చేరారు. సైరస్ పిస్సతో కలిసి శరీరంలో పాస్పరస్ కనిపెట్టి పద్ధతి కనుగొన్నారు. దీన్ని ఫి- సుబ్బారావు పద్ధతి అంటారు. ఆ తర్వాత శరీరంలో అడెనోసిన్ ట్రై సల్ఫేట్, ఫాసో క్రియాటిన్ ఉన్నయని కనిపెట్టడంతో ఆయన పరిశోధనా ఫలితాలు వైద్య పాఠ్యగ్రంథాలలోకి చేరాయి. సుబ్బారావు కనిపెట్టిన పార్టీ మైక్సిన్ ను ఇప్పటికీ పశువుల దాణాలో వాడతారు. బోదకాలు చికిత్స కోసం హెన్రిజెన్ కనిపెట్టింది కూడా ఆయనే.

సాగర్ ఆనకట్టకు స్ఫూర్తి ముక్త్యాల రాజా.

ముక్యాల  రాజ ప్రసిద్ధుడైన రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణానికి అకుంటిత దీక్షతో పని చేశారు. పులిచింతలలో ప్రాజెక్టు నిర్మించాలన్న ఆయన ప్రతిపాదన్ ఇటీవలే కార్యరూపం దాల్చింది. మద్రాసు ప్రభుత్వం కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేసే మద్రాసుకు కృష్ణా జలాలను తరలించాలని ఆలోచిందింది. ఆ దశలో ముక్త్యాల తొమ్మిది జిల్లాల్లో పర్యటించి. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణం కోసం ప్రతి గ్రామానికి వెళ్లి సంతకాలు సేకరించారు. అప్పుడు కారడివిగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి నందికొండ వద్ద నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మిచాలని పట్టుబట్టారు. ఈ పథకానికి రూపకల్పన చేయటానికి సొంత ఖర్చుతో ఉద్యోగ విరమణ చేసిన ఇంజినీర్ల సలహాలు తీసుకుని అనకట్ట నిర్మాణానికి కారకులయ్యారు. మద్రాసు ప్రభుత్వం ఆయన ప్రయత్నాలకు గండి కొట్టాలని ప్రయత్నించినప్పుడు కృష్ణా రైతుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. రాజా ప్రతిపాదనలను పరిశీలించడం కోసం ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. ఖోస్లా కమిటీ ఆనకట్ట నిర్మించాల్సిన చోటుకి వెళ్ళడానికి మార్గం లేదని కాళ్ళీడడానికి అసలు కారణం కృష్ణా-పెన్నా ప్రాజెక్టు నిర్మించి నీటిని మద్రాసుకు తరలించకు పోవాలనే మద్రాసు పన్నాగానికి అంటకాగాడమే. కె.ఎల్.రావు ఈ విషయం కనిపెట్టి బోస్లా కమిటీ పర్యటనకు వెసులుబాటు కల్పించాలని రాజాను కోరారు. ముక్త్యాల రాజు నాలుగు రోజుల వ్యవధిలో ఇరవై కిలోమీటర్ల రోడ్డు వేయించి కమిటీ పర్యటనకు మార్గం సుగమం చేశారు. రోడ్డు వేయడానికి అడవిలో చెట్లు నరికేశారని ముక్త్యాలరాజా మీద కేసులు కూడా నమోదయ్యాయి. చివరకు ఖోస్లా పర్యటన సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ముక్త్యాలరాజు 52 లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ వ్యయంలో భాగం పెంచుకున్నారు.

హెట్రోజాన్ ను కనిపెట్టిందెవరు?

1
కె. ఎల్. రావు,
2
ముక్త్యాల రాజా
3
పీర్ అహమద్ ఆలీ
4
ఎల్లా ప్రగడ సుబ్బా రావు..

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation