సూచన: ఈ కింది ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి ఇందుగల ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
అనేక శాస్త్ర - కావ్య -నాటకాదులకు వ్యాఖ్యానములు రచించిన ఆంధ్రులెందరోఉన్నారు. వారిలో సర్వప్రథములు, ప్రాత: స్మరణీయుడు, సర్వతంత్రస్వతంత్ర
వ్యాఖ్యాత్న సార్వభౌముడు, మహామహూపాధ్యాయుడువయిన "మల్లినాథసూరి" ప్రపంచసంస్కృత విద్వాంసు లందరికిని సువిదితుడె, మల్లివాడ సూరి శతాబ్దివాడు, హైదరాబాదు నగర సమీపము నందలి "కొలపమ" అను గ్రామము ఆయన నివాసస్థానము, ఈ మహాపండితుడు కాళిదాస కావ్యత్రయిక, కిరతార్జానీయమునకు, మాముని శిశుపాలవధమునకు, శ్రీహర్షుని వైశాధీయచరితమునకు, భట్టికావ్యమునకు అనన్యా దృశ్యములైన వ్యాఖానములను రచించి అతనికి పూర్వము ఈ గ్రంథములకు వ్రాయబడిన వ్యాఖానములను ఖదించెను. అతని వ్యాఖ్యానములను ప్రపంచ సంస్కృతి విద్వంసులందరుమిక్కిలి ప్రశంసించుచు ఆదరించుచున్నారు. మల్లినాథుడు "ఏకావళి" అను అలంకార గ్రంథమునకు కూడా తరళము అను పేరులో వ్యాఖానమును రచించి తన అలంకారిక గ్రంధవ్యాఖ్యాన చతుర్యమునుగూడ ప్రకటించెను.
క్రీ. శ. 14వ శతాబ్దికి చెందిన (1) కాటయవేమభూపుడు కాళిదాసుని " శాకుంతల - విక్రమోర్వశీయ-మూళవికాగ్ని మిత్ర, నాటకెత్రయీకి. వ్యాఖ్యలను. (2) పెదకోమటి వేమభూపాలుడు "శృంగారదీపిక" అను పేరుతో అమరుక కావ్యమునకు వ్యాఖ్యాను; (3) "భవదీపిక అను పేరుతో సప్త వ్యాఖ్యను (రెండు గ్రంధములక వ్యాఖ్యానములు), (4) బొమ్మకంటి అప్పయార్యుడు నామలింగానుశాసనమునకు వ్యాఖ్యను, (5) అష్టభాషాచక్రవర్తి యైన శ్రీనివాసాచార్యుడు కాళిదాసు "శకుంతల" నాటకమునకు వ్యాఖను రచించిరి..
క్రీ.శ.15 వ శతాబ్దికి చెందిన కుమారస్వామి సొమసినఅగస్ట్న విధ్యనాయుని ప్రతాపరుద్ర యశోభూ షనమునకు "రత్నాపణము" అను వ్యాఖ్యాను రచి మూలమునకు మిక్కిలి శోభను చేకూర్చేను.
క్రీ. శ. 16 వ శతాబ్దికి చెందిన (1) విజయనగరాధిప శ్రీక్రిష్ణదేవరాయాస్తాన పండితుడు లొల్ల లక్ష్మీధరుడు "సౌందర్యలహరి" కి వ్యాఖ్యను, (2) చెరుకూ యర్నేశ్వర పండితుడు - (2) తాళ్ళపాక తిరుమల దీక్షిత్తులు కావ్యప్రకాశామునకు వ్యాఖ్యానములను రచించిరి.
క్రీ.శ. 13 వ శతాబ్దికి చెందిన నరహరి సరస్వతీతీర్థుడు "బాలవికానురంజని " అను పేరుతోనూ, పై యాకరుణుడైన నాగేశ్వర చట్టుడు "ఉద్యోతను అను పేరుతోను కావ్యప్రకాశమునకు వ్యాఖానములను రచించిరి.
క్రీ. శ. 17 వ శతాబ్దివాడైన ఆవంచ రామచంద్ర బుధేంద్రుడు ధర్మహరి సుభాషితమునకు-భోజరాజు చంపూరామాయణమునకు వ్యాఖానములను రచించెను.
క్రీ.శ. 18వ శతాబ్దివాడైన "ఉరె -దేచమంత్రి" శివ పంచస్తవికి వ్యాఖ్యానము వ్రాసెను.