Comprehension Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి ప్రశ్నలకు సరైన సమాధానములు రాయండి. 

భారతీయ భాషల్లో నవలా రచన 1865 లో మొదలైంది. బంకించంద్ర ఛటర్జీ బెంగాలీ రచన 'దుర్గేశ నందిని' తొలి భారతీయ నవల. తరువాత 1872 లో తెలుగులో నరహరి గోపాలకృష్ణను సెట్టి 'శ్రీరంగరాజ చరిత్ర' రాసారు. ఆయన దీని గురించి "తెలుగు వారి యాచారంబులు తెలుపునట్టి ప్రబందంబు" గా చెప్పుకున్నారు. ఆ డాది పోర్ట్ సెయింట్ జార్జ్ గజిట్ సప్లిమెంట్ మాత్రం తొలి తెలుగు నవలగా దీన్నే పేర్కొంది. అయితే .... 'శ్రీరంగరాజ చరిత్ర' కు పన్నెండేళ్ళ ముందే (1860) తడకమల్ల కృష్ణారావు 'కంబుకంధర చరిత్ర' వెలువబడింది. ఇందులో నవల బీజాలు కనబడతాయి. కందుకూరి వేరేశలింగం 'రాజ శేఖర చరిత్రము' 1878 లో 'వివేకవర్ణిని' పత్రికలో దారావాహికగా ప్రచురితమైంది. దీనికి ప్రేరణ అలీవర్ గోల్డ్ స్మిత్ (1728-1774) ఆంగ్ల నవల 'ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్'. వీరేశలింగం కూడా తన రచనను వచన ప్రబంధమనే చెప్పారు. ఆ తరువాత 'రాజశేఖర చరిత్రము' మీద విమర్శనా వ్యాసం రాస్తూ, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి ఈ కొత్త సాహితీ ప్రక్రియకు 'నవల' అనే పేరును సూచించారు. ఆ తరువాత అదే స్థిరపడింది. 

1892-1896 మధ్యలో 'చింతామణి' పత్రిక పోటీలు నిర్వహించి మరీ నవలా రచనను ప్రోత్సహించింది. ఈ పోటీల్లో చిలకమర్త లక్ష్మీనరసింహం నవల 'రామచంద్ర విజయముకు' కు మొదటి బహుమతి దక్కింది. ఆ తరువాత నవలలు ఊపందుకున్నాయి. అదే క్రమంలో రచయితలు సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకోవడం ప్రారంభించారు. తల్లా ప్రగడ సూర్యనారాయణ 'హేలావతీ' నవలలో అంటరానితనం ఘోరపాపమనే సందేశాన్నిచ్చారు. వెంకట పార్వతీశ కవులు కూడా తమ 'మాతృమందిరము' లో అస్పృశ్యతను ఖండించారు. ఆ తరువాత విభిన్న ఇతివృత్తాలతో నవలలు వెలువడ్డాయి.

చిలకమర్తి వారు తొలి హాస్య నవల' గణపతి 'కి ప్రాణం పోసారు. లోకం నైజాన్ని ప్రతీకారంగా చెబుతూ శేషభట్టరు వేంకట రామానుజాచార్యులు 'ప్రాకృత దాంపత్యము' రచించారు. కాల్పనికోద్యమ ప్రభావంతో విశ్వనాథ సత్యనారాయణ 'ఏకవీర' ను సృజంచారు. ఇక పార్వతీశం అనే అమాయకుడు ఇంగ్లండు వెళ్ళి 'బారిస్టరు' పరీక్షకు చదువుకోవటాన్ని మొక్కపాటి నరసింహ శాస్త్రి 'బారిష్టరు పార్వతీశం' లో హస్యస్పోరకంగా చిత్రించారు. మొదటి భాగం రచించిన చాలా కాలానికి ఈ నవలకు రెండు, మూడు భాగాలు రచించారు. కానీ వాటిలో హాస్యం అంతగా పండలేదు. 

'మాలపల్లి' ప్రత్యేక ముద్ర

సామాజిక చైతన్యానికి బాటలు పరిచిన 'మాలపల్లి' నవలను ఉన్నవ లక్ష్మీ నారాయణ కారాగారంలో డగా రచించారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహోద్యమంలో ఉన్నవను ప్రభుత్వం అరెస్టు చేసి, రాయవేలూరు జైలులో నిర్భంధించింది. 'మాలపల్లి' నవలలో అణగారిన వర్గాల జీవిత చిత్రణ ప్రదాన అంశం. ఈ నవల్లో ప్రభుత్వ వ్యతిరేక అంశాలున్నాయని అప్పటి పాలకులు నిషేదించారు. ఆచార్య రంగా 'హరిజన నాయకుడు' నవల 'మాలపల్లి' ప్రేరణతో వచ్చింది. పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన, సంభాషణ, రచన, భాష ఏ కోణం నుంచి చూసినా 'మాలపల్లి' ఇరవయ్యే శతాబ్ది తెలుగు సాహిత్యానికి గర్వకారణమైంది. జాతీయోధ్యమ కాలం నాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులను కూడా పలు తెలుగు నవలలు వివరించాయి. వేలూరి శివరామ శాస్త్రి 'ఓబయ్య' ... జాతీయోధ్యమ కాలంలో వచ్చిన ఉత్తమ నవల. అడవి బాపిరాజు 'నారాయణరావు', విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు', ఉప్పల లక్ష్మణరావు 'అతడు ఆమె', మహీధర రామ మోహనరావు 'కొల్లాయిగట్టితేనేమీ'? కొడవటిగంటి కుటుంబరావు 'చదువు' లాంటి నవలల్లో జాతీయోధ్యమ నేపథ్యం ప్రముఖంగా కనిపిస్తుంది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో జాతీయోధ్యమం ముమ్మరంగా సాగుతున్న దశలో అనేక కొత్త మతాలు, సంఘ సంస్కరణ ఉద్యమాలు ప్రజలను ప్రభావితం చేస్తున్న సమయంలో విశ్వనాథ 'వేయి పడగలు' రచించారు. ఇందులో విశ్వనాథ సామాజిక దృక్పథం సనాతనమైంది. మార్పు కోరనిది. విశ్వనాథ అభిప్రాయాలను కొందరు అతిగా మెచ్చుకుంటే కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. 

ఇరవయ్యే శతాబ్ధి మొదటి దశాబ్దంలో తెలుగులో కొన్ని ఉత్తమ నవలలు వచ్చాయి. అవి చాలా భాగం ఇతర భాషల నుంచి అనువాదమైనవి. బంకించంద్ర ఛటర్జీ 'ఆనందమఠము' ను ఓ.వై. దొరస్వామయ్య, సర్ వాల్టర్ స్కాట్ ఇంగ్లీషు నవల 'ఐవన్హో' ను కేతవరపు వెంకట శాస్త్రి తెనుగించారు. భారతీయ నవలా రచయితల్లో ప్రసిద్దులైన బంకించంద్ర ఛటర్జీ, శరత్, రవీంద్రనాథ్ ఠాగూర్, మున్షీ ప్రేమచంద్ నవలలు తెలుగులోకి వచ్చి, ఇక్కడి తెలుగు పాఠకుల ఆదరణ చూరగొన్నారు. శరత్ రచనలు పాఠకులనే కాకుండా రచయితలను కూడా ప్రభావితం చేసాయి. విశ్వవిఖ్యాత రచయిత మాక్సింగోర్కి, 'అమ్మ' నవల (అనువాదకులు క్రొవ్విడి లింగరాజు) ఒక తరం పాఠకుల మీద చాలా ప్రభావం చూపింది. ఆ తరువాత కాలంలో 'ఏడు తరాలు' (అలెక్స్ హేలీ 'రూట్స్' కు సహవాసి అనువాదం) కూడా చాలామందిని కదిలించింది. 

చలం సంచలనం.... మనస్తత్వ చిత్రణ

లోకరీతికి భిన్నంగా, ధైర్యంగా విప్లవాత్మక భావాలను చలం తన కథలు, నవలల ద్వారా వెలువరించారు. 'శశిరేఖ' 'ధైవమిచ్చిన భార్య', 'అమీనా', 'మైదానం' నవలలు తెలుగు సాహిత్యాన్ని కుదిపేసాయి. చలం నవలల్లోని స్వేచ్చా ప్రణయ సిద్ధాంతం సంప్రదాయాభిమానులకు ఆగ్రహం కలిగించింది. కథకన్నా పాత్రల మనస్తత్వ చిత్రణకు ప్రాధాన్యమిచ్చిన నవలలూ తెలుగు సాంఘిక నవలను ఓ మలుపు తిప్పాయి. త్రిపురనేని గోపీచంద్ 'అసమర్దుని జీవయాత్ర', బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' ఇలాంటివే. చైతన్య స్రవంతిలో సాగే 'అంపశయ్య' (నవీన్), 'హిమజ్వాల, 'అనుక్షణికం' (వడ్డెర చండీదాసు), అతడు అడవిని జయించాడు (కేశవరెడ్డి), 'ఖాకీవనం' (కే.ఎన్.వై. పతంజలి), 'ఊబిలో దున్న' (వినుకొండ నాగరాజు), 'హీంగ్ మి క్విక్' (బీనాదేవి) నవలలు బుద్ధి జీవులను అలరించాయి. ఇంకొంతమంది రచయితలు మధ్య తరగతి జీవితాలను వాస్తవికంగా కళాత్మకంగా చిత్రించడంలో మంచి నేర్పు చూపారు. కొడవటిగంటి కుటుంబరావు 'చదువు, అరుణోదయం, ఐశ్వర్యం, కొత్త అల్లుడు, కొత్త కోడలు'; ముని మాణిక్యం 'రుక్కుతల్లి', రావూరు వెంకట సత్యనారాయణ రావు 'నెలవంక', జె.వి. కృష్ణారావు 'కీలుబొమ్మలు', శారద 'మంచీ-చెడూ, 'రావి శాస్త్రి 'అల్పజీవి', 'రాజు-మహిషి' లాంటివి పాఠకులు ఆదరణ పొందాయి. ఇక కొవ్వలి లక్ష్మీనరసింహారావు, జంపని చంద్రశేఖర రావులు సాగించిన పాపులర్ నవలా యజ్ఞం విశిష్టమైంది. వీరు తమ రచనల ద్వారా ఒక తరం పాఠకుల్లో తీవ్ర పఠనాసక్తిని పెంపొందించింది. కొవ్వలి వెయ్యికి పైగా నవలలు రాశి చరిత్ర సృష్టించారు. 

ఆలివర్ గోల్డ్ స్మిత్ నవల వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ ప్రేరణతో తెలుగులో నవల రాసిన రచయిత 

1
తడకమల్ల కృష్ణారావు
2
నరహరి గోపాల కృష్ణమ సెట్టి
3
కందుకూరి వీరేశలింగం
4
కాశీభట్ల బ్రహ్మయవాసి

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation